Thursday, September 19, 2024

Latest Posts

డబ్బింగ్ సినిమాలపైనే ఆసక్తి చూపుతున్న మైత్రి సంస్థ..?

‘మైత్రి మూవీ మేకర్స్’ టాలీవుడ్ టాప్ బ్యానర్స్ లో ఒకటి. ఎంట్రీ ఇవ్వడంతోనే ‘మహేష్ బాబు శ్రీమంతుడు’, జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, రామ్ చరణ్ ‘రంగస్థలం’ వంటి 3 ఇండస్ట్రీ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కూడా చేసిన ప్రతి పెద్ద సినిమా బాగా ఆడింది. 2023 సంక్రాంతికి అయితే అటు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’.. ఇటు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ వంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను విడుదల చేయడమే కాకుండా.. ఆ రెండింటితో సూపర్ హిట్లు అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.

అంతేకాదు ఆ సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. వరుస పెట్టి సినిమాలను విడుదల చేస్తూ వస్తోంది. ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘హనుమాన్’ ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలను విడుదల చేసింది ఈ సంస్థ. అంతేకాదు చిన్న సినిమాలను కూడా వరుసపెట్టి విడుదల చేస్తుంది. కానీ ఎందుకో ఈ సంస్థకి డబ్బింగ్ సినిమాలపై మోజు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.

‘గోట్ లైఫ్- ఆడు జీవితం’, ‘మంజుమ్మల్ బాయ్స్’, ’లవ్ గురు’, ‘మహారాజా’.. ఇలా ఎక్కువ శాతం డబ్బింగ్ సినిమాలనే విడుదల చేస్తూ వస్తోంది ఈ సంస్థ. గత వారం ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) చిత్రాన్ని విడుదల చేసిన ఈ సంస్థ.. ఈ వారం ‘ఏ.ఆర్.ఎం’ చిత్రాన్ని కూడా విడుదల చేస్తుంది.

ఇలా వరుసపెట్టి డబ్బింగ్ సినిమాలపైనే ఆధార పడుతూ వస్తోంది ‘మైత్రి’ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. చూస్తుంటే.. స్ట్రైట్ సినిమాలపై ఈ సినిమాకి నమ్మకం తక్కువో లేక.. డబ్బింగ్ సినిమాలకి అయితే ఎక్కువ షేర్ మిగులుతుందనో’ కానీ ఈ సంస్థ ఎక్కువగా డబ్బింగ్ సినిమాలపైనే మోజు పెంచుకున్నట్టు స్పష్టమవుతుంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.