‘మైత్రి మూవీ మేకర్స్’ టాలీవుడ్ టాప్ బ్యానర్స్ లో ఒకటి. ఎంట్రీ ఇవ్వడంతోనే ‘మహేష్ బాబు శ్రీమంతుడు’, జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, రామ్ చరణ్ ‘రంగస్థలం’ వంటి 3 ఇండస్ట్రీ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కూడా చేసిన ప్రతి పెద్ద సినిమా బాగా ఆడింది. 2023 సంక్రాంతికి అయితే అటు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’.. ఇటు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ వంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను విడుదల చేయడమే కాకుండా.. ఆ రెండింటితో సూపర్ హిట్లు అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.
అంతేకాదు ఆ సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. వరుస పెట్టి సినిమాలను విడుదల చేస్తూ వస్తోంది. ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘హనుమాన్’ ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలను విడుదల చేసింది ఈ సంస్థ. అంతేకాదు చిన్న సినిమాలను కూడా వరుసపెట్టి విడుదల చేస్తుంది. కానీ ఎందుకో ఈ సంస్థకి డబ్బింగ్ సినిమాలపై మోజు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.
‘గోట్ లైఫ్- ఆడు జీవితం’, ‘మంజుమ్మల్ బాయ్స్’, ’లవ్ గురు’, ‘మహారాజా’.. ఇలా ఎక్కువ శాతం డబ్బింగ్ సినిమాలనే విడుదల చేస్తూ వస్తోంది ఈ సంస్థ. గత వారం ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) చిత్రాన్ని విడుదల చేసిన ఈ సంస్థ.. ఈ వారం ‘ఏ.ఆర్.ఎం’ చిత్రాన్ని కూడా విడుదల చేస్తుంది.
ఇలా వరుసపెట్టి డబ్బింగ్ సినిమాలపైనే ఆధార పడుతూ వస్తోంది ‘మైత్రి’ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. చూస్తుంటే.. స్ట్రైట్ సినిమాలపై ఈ సినిమాకి నమ్మకం తక్కువో లేక.. డబ్బింగ్ సినిమాలకి అయితే ఎక్కువ షేర్ మిగులుతుందనో’ కానీ ఈ సంస్థ ఎక్కువగా డబ్బింగ్ సినిమాలపైనే మోజు పెంచుకున్నట్టు స్పష్టమవుతుంది.