టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హైదరాబాద్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ని తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లోని అక్రమ కట్టడాలను తొలగించటం, చెరువులను రక్షించటం, విపత్కర పరస్థితుల్లో హైదరాబాద్ నగరానికి అండగా ఉండటం ఈ ఏజెన్సీ ప్రధాన లక్ష్యాలు. ఈ ఏజెన్సీ తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. అందులో భాగంగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చేసింది.
ఎన్ కన్వెన్షన్పై గతంలో నుంచి చాలా ఆరోపణలున్నాయి. తమ్మిడి చెరువున కబ్జా చేసి ఈ కట్టడాన్ని కట్టారు. దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేశారని ఆరోపణలున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలంటూ స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదలు అందాయి. వీటి మేరకు అధికారులు పోలీసుల బందోబస్తుతో ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేశారు. గత ప్రభుత్వ సమయంలోనూ ఈ కట్టడంపై అధికారులకు ఫిర్యాలు వెళ్లాయి. చర్యలు తీసుకోవటానికి అధికారులు వెళ్లారు. కానీ చివరి నిమిషంలో వెనుదిరిగిన ఘటనలున్నాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎవరూ చేయని సాహసానికి పూనుకుందనే చెప్పాలి.