బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సందడి మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది. మరి ఈ సీజన్ షో ఎలా ఉండనుంది? ఈ సీజన్ లో ఎవరు హోస్టింగ్ చేస్తారు.., కంటెస్టెంట్స్ ఎవరెవరు అని తెలుసుకోవడానికి బిగ్ బాస్ లవర్స్ తెగ ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో జులై 21న నాగార్జున ట్విట్టర్ లో ప్రోమోను లాంచ్ చేశారు. ఈ పోస్ట్ కి మీకు అన్ లిమిటెడ్ వినోదాన్ని పంచేందుకు తిరిగి వచేస్తున్నాం అనే క్యాప్షన్ ని జోడించారు. దీంతో నాగార్జున వరుసగా 6వ సీజన్ హోస్ట్ చేయనున్నారని క్లారిటీ వచ్చేసింది.
సీజన్ 6 ప్లాప్ కావడంతో సీజన్ 7 సరికొత్త కాన్సెప్ట్స్ తో తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. కాగా సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్ 8 కంటెస్టెంట్స్కు సంబంధించి ఇప్పటివరకు చాలా పేర్లు వినిపించాయి. అలీ తమ్ముడు ఖయ్యం అలీ, యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ రీతూ చౌదరి, కాంట్రవర్షియల్ లైఫ్తో చాలామందికి పరిచయమైన అమృత ప్రణయ్, బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష, కుమారీ ఆంటీ, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ.. ఇలా చాలా మంచి పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి. .
తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన ప్రోమో షూటింగ్ పూర్తి అయిందని, దీన్ని రేపు విడుదల చేయనున్నారని ఆ వార్త సారాంశం. కాగా, బిగ్ బాస్ ప్రతి సీజన్ సరికొత్త ట్యాగ్ లైన్ తో వచ్చేస్తోంది. గత సీజన్ బిగ్ బాస్ ఉల్టా పుల్టా అనే ట్యాగ్ లైన్ తో వచ్చి అందరినీ అలరించింది. ఇప్పుడు వచ్చే సీజన్ ‘బిగ్ బాస్ 8 ఎంటర్ టైన్మెంట్ కా బాస్’ అనే ట్యాగ్ లైన్ తో రానుందని సమాచారం.